డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
NEWS Sep 01,2026 12:05 am
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లను పునర్నిర్మించాలని, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని అలాగే నూతన గ్రంథాలయాన్ని నిర్మించాలని కోరుతూ అడిషనల్ కమిషనర్ ఆయాజ్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.