రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
NEWS Aug 30,2026 11:13 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చల్వాయి సమీపంలోని జాతీయ రహదారిపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న కారు ట్రాక్టర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.