ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
NEWS Aug 30,2026 04:25 pm
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ 3 స్థానంలో కొత్త జీఓ తీసుకురావాలని, 1/70 చట్టం అమలు చేయాలని, గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని చర్చించారు. సింగరేణిలో ఏజెన్సీ గిరిజనులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.