కరీంనగర్ కౌన్సిల్లో మాజీ మేయర్ వినూత్న నిరసన
NEWS Aug 29,2026 11:50 pm
పారిశుధ్య కార్మికుడి వేషధారణలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిబ్బందికి చీపుర్లు, రక్షణ పరికరాలు సరిగా అందించడం లేదని, నగర విస్తీర్ణానికి తగినట్లు కార్మికులను కేటాయించకుండా నగర పారిశుధ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై, టౌన్ ప్లానింగ్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.