ఒక్క సీసీ కెమెరా.. వంద మంది పోలీసులతో సమానం
NEWS Aug 29,2026 11:31 pm
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్టుడే: జ్యోతినగర్ రోడ్ నెం.1లోని మహాత్మా స్ట్రీట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు ప్రారంభించారు. సునీల్రావు మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు వంద మంది పోలీసులతో సమానమని, కాలనీల రక్షణకు ప్రజలు కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీజన్రెడ్డి, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.