రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ అభివృద్ధి: కొలగాని శ్రీనివాస్
NEWS Aug 29,2026 11:29 pm
కరీంనగర్: రాజకీయాధిక్యతలకు అతీతంగా నగరాభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రశాంతంగా జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలకు సభ ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నిధులు సమీకరించి పారిశుధ్యం, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామని మేయర్ పేర్కొన్నారు.