కరీంనగర్ డంపింగ్ యార్డు తరలించాలని ధర్నా
NEWS Aug 29,2026 11:28 pm
కరీంనగర్: నగరంలోని డంపింగ్ యార్డును దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. జిల్లా బాధ్యుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. 4.5 లక్షల టన్నుల చెత్తతో ప్రజలు దుర్వాసన, పొగతో ఇబ్బంది పడుతున్నారని, రూ.25 కోట్లు దుర్వినియోగం చేసినా బయో మైనింగ్ జరగలేదని ఆరోపించారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు.