వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
NEWS Aug 29,2026 02:14 pm
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కాన్పూర్ నుంచి మదురై వెళ్లే ప్రత్యేక రైలు (01925) సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25 వరకు, మదురై నుంచి కాన్పూర్ వెళ్లే రైలు (01926) సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మరుసటి రోజు వరంగల్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.