ఆగస్టు 30న తల్లుల ఖాతాల్లో నగదు జమ
NEWS Aug 28,2026 08:22 pm
AP: ఈ నెల 30న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేలు ఆర్థిక సహాయం జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాసు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. AP వ్యాప్తంగా సుమారు 2 లక్షల 80 వేల మందికి పైగా విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి సంబంధించి తమ దరఖాస్తు లేదా చెల్లింపు స్థితిని గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్ ద్వారా పరిశీలించుకోవచ్చు. సచివాలయాలను సందర్శించి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది.