కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
NEWS Aug 28,2026 06:59 pm
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక దివ్యంగా చిన్నారులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.