విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
NEWS Aug 28,2026 08:22 pm
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణల సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాడాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో బషీర్బాగ్ విద్యుత్ అమరవీరులకు నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ నాయకులు సృజన్కుమార్ మాట్లాడుతూ.. అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తోందని, స్ఫూర్తిదాయక ఉద్యమాలతో దీనిని అడ్డుకుంటామని పేర్కొన్నారు.