రోడ్డు విస్తరణ పనులు త్వరగా చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని కోతులనడుమ గ్రామం ఉంటుంది. రహదారి విస్తరణలో భాగంగా ఆ గ్రామస్తులు రోడ్డు దాటేందుకు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. అండర్ పాస్ ఏర్పాటు చేస్తే రోడ్డు దాటేందుకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు స్పందించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.