తెలంగాణకు చెందిన 22 మంది గల్లంతు
NEWS Aug 27,2026 08:14 pm
నేపాల్ వరదల పరిస్థితులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేపాల్లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు గుర్తించామని తెలిపారు. వీరిలో 6గురు రాష్ట్ర వాసులు కాగా, 17 మంది ప్రవాస తెలంగాణ వారని మంత్రి తెలిపారు. మిగతా 22 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు. చిక్కుకున్నవారి వివరాలు విదేశాంగశాఖకు పంపించామని, కేంద్రం, నేపాల్లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. దిల్లీ, హైదరాబాద్లో హెల్ప్లైన్, కోఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దిల్లీలో హెల్ప్లైన్ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969.