బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
NEWS Aug 27,2026 08:16 pm
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. బొమ్మకల్ కు చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధా వీరారెడ్డి కలిసి ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.