నేడు ధర్నా చౌక్ వద భద్రాద్రి జిల్లా జేఏసీ మహాధర్నా
NEWS Aug 27,2026 10:07 am
భద్రా జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నేడు మహా ధర్నా నిర్వహించనున్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, రూ.2,000 కోట్ల పెండింగ్ ఉద్యోగుల బిల్లులను ప్రతి నెల విడుదల చేయడం, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.