తిమ్మాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం: డ్రైవర్, కండక్టర్కు గాయాలు
NEWS Aug 27,2026 10:07 am
తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్, కండక్టర్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.