ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
NEWS Aug 26,2026 09:55 pm
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణిచివేత ధోరణితోనే ఉద్యమాల పంత మారుతుందన్నారు.రాజకీయ ఖైదీల విముక్తి కోసం ఈ నెల 29న చేపట్టనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.