మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సీపీ శ్వేతా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలని జనగామ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.