ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
NEWS Aug 26,2026 05:59 pm
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థినిలు ఉపకార వేతనాలకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి 30,000 చొప్పున మూడేళ్ల కలిపి రూ.90 వేలు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థినిలు సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 31లోగా ఎలాంటి ఫీజు లేకుండా https://azimpremjifoundation.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.