తిరుపతికి వరంగల్ మీదుగా మరొక రైలు
NEWS Aug 25,2026 02:49 pm
వరంగల్ మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దాన్బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది. 22363 నెంబర్ గల ఈ రైలు ప్రతి సోమవారం ఉదయం 12.08 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకొని రేణిగుంటకు ఉదయం 10.25 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(22364)రైలు రేణిగుంట రైల్వే స్టేషన్ కు సాయంత్రం 4.20గంటలకు చేరుకొని వరంగల్ కు బుధవారం ఉదయం12.09 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులు రేణిగుంటలో దిగి నేరుగా తిరుపతి వెళ్లడానికి అవకాశం ఉంది.