జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
NEWS Aug 25,2026 03:30 pm
రాజీమార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ నిర్మల గీతాంబా పేర్కొన్నారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజీ పడదగిన కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 2,410 కేసులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.