రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
NEWS Aug 21,2026 08:36 am
వరంగల్ త్రినగరి వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా పేర్కొన్నారు.త్రినగరిలో ట్రాఫిక్ సమస్యలపై సీపీ శ్వేత అధికారులతో సమీక్ష నిర్వహించారు.సిగ్నల్,బ్లాక్ స్పాట్లు, పార్కింగ్, రోడ్డు మరమ్మతులు, వెలుతురు లేని 159 ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న,డీసీపీ కవిత తదితరులు పాల్గొన్నారు.