కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కాలి
NEWS Aug 21,2026 09:00 am
కరీంనగర్: కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తోందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా కార్మిక లోకం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గురువారం నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ప్రచార పత్రాన్ని ఆవిష్కరించిన ఆయన, సెప్టెంబరు 6, 7, 8 తేదీలలో జరిగే సభలకు కార్మికులు భారీగా తరలిరావాలని కోరారు.