కాజీపేటలో కొత్త రైల్వేడివిజన్ ఏర్పాటు చేయాలి
NEWS Aug 21,2026 09:01 am
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ MP కడియం కావ్య కోరారు.ఈ మేరకు సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్ను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను, ఈ ప్రాంతానికి ఉన్న రైల్వే ప్రాధాన్యతను జీఎంకు వివరించారు. కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని, రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, రైల్వే వినియోగదారులు కూడా ఈ డిమాండ్ను కోరుతున్నారని తెలిపారు.