విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన సీఐపై చర్యలకు ఆదేశాలు
NEWS Aug 21,2026 08:36 am
మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఘటనపై జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పందించారు. ఆందోళనలో టౌన్ సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థి గొంతు పట్టుకున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ వీడియోలపై స్పందించిన ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారితో సమగ్ర విచారణకు ఆదేశించమని విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.