మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
NEWS Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై 12 మంది వ్యక్తులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రమేష్ కు భార్య,ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.