చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
NEWS Aug 19,2026 02:07 pm
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కోణతాల హరినాథ్ బాబు ఆధ్వర్యంలో 12వ రోజు కొనసాగుతున్న నిరసనకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు సంఘీభావం తెలిపారు. ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరారు.