సెప్టెంబర్ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
NEWS Aug 18,2026 08:44 pm
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్, పీఆర్సీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.