ఘనంగా నేతాజీ వర్ధంతి వేడుకలు
NEWS Aug 18,2026 08:22 pm
రాయికల్ మండలం మైతాపూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా మైతాపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన నేతాజీ చిత్రపటానికి బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. బీజేపీ నాయకులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.