భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
NEWS Aug 18,2026 08:25 pm
కొడిమ్యాల మండలంలో భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ భూ భారతి, సాదా బైనామా, మీ సేవ ఫైళ్లు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ప్రజలకు మీ-సేవ సర్టిఫికెట్లను సకాలంలో అందించాలని అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు