కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్-1 డిపోకు చెందిన బస్సు కొండగట్టు వద్ద ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.