గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
NEWS Aug 17,2026 07:48 pm
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గర్భిణులు ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని డాక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు ఈ ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు.