హైకోర్టు కేసుతోనే పథకాల అమలులో జాప్యం
NEWS Aug 17,2026 07:30 pm
రాయికల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యానికి హైకోర్టులో దాఖలైన పిటిషన్నే కారణమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వాసం రాజేందర్ తెలిపారు. రాయికల్ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా నిరసనలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.