కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు
NEWS Aug 17,2026 07:34 pm
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాజయ్య పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చక వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులతోపాటు నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.