కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలి
NEWS Aug 17,2026 07:35 pm
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన పనులను ప్రారంభించి కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని బాలసముద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యాలంటీల అమలులో విఫలమైందన్నారు. కాంగ్రెస్ నేతలు అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాటిని మానుకోవాలని హితవు పలికారు.