బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
NEWS Aug 17,2026 10:04 pm
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని నియమించారు. అధ్యక్షుడిగా భుక్య సుమన్ నాయక్, ఉపాధ్యక్షులుగా పల్త్య బలరాం, భుక్య బలరాం, ప్రధాన కార్యదర్శిగా భుక్య రాజు నియమితులయ్యారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.