పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు
నిందితులపై పీడీ యాక్ట్
NEWS Aug 17,2026 10:05 pm
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, సూర్య మణి కుమార్, యాదవ్, మొహమ్మద్ ఆదిల్ ఖాన్ లను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్ రెడ్డిలను సీపీ అభినందించారు. నేరస్థులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.