విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
NEWS Aug 17,2026 10:30 pm
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏరియా అంతా చీకటి మయమైంది. ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ అన్నవేణి వేణు ఫిర్యాదు చేశారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మల వల్ల విద్యుత్ వైర్లు తెగిపోయి 2 నెలలుగా విద్యుత్ ఆగిపోయిందని వెల్లడించారు.