వేయి స్తంభాల ఆలయంలో నాగుల పంచమి
NEWS Aug 17,2026 04:37 pm
హనుమకొండ: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసం తొలి సోమవారం, నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ అర్చకులు రుద్రేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం, 200 మంది పుణ్య దంపతులతో సామూహిక రుద్రాభిషేకాలు, మహా రుద్ర హోమం చేపట్టారు. నాగేంద్ర స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించగా మహిళలు పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. అనంతరం వందలాదిమంది భక్తులకు అన్నదానం చేశారు. ప్రత్యేక దినం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.