ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి
NEWS Aug 17,2026 03:32 pm
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన కార్యక్రమంలో మొత్తం 42 ఫిర్యాదు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. ప్రజల సమస్యలను స్వీకరించేందుకు సుమారు 24 శాఖలకు చెందిన అధికారులు, ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందిన 42 ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపించినట్లు ఎంపీడీవో తెలిపారు.