ఉదయనిధి వ్యాఖ్యలపై అన్నామలై ఆగ్రహం
NEWS Aug 17,2026 03:00 pm
తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై విమర్శించారు. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ చురకలు అంటించారు. రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.సోమవారం చెన్నైలో నిర్వహించిన 'ఇండియా టుడే రౌండ్టేబుల్' సమావేశంలో అన్నామలై పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన కొందరు నాయకులు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించడం, మహిళలను అనవసరంగా వివాదాల్లోకి లాగడం వంటి పాత తరహా ధోరణులనే ఇంకా అవలంబిస్తున్నారని మండిపడ్డారు.