ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
NEWS Aug 17,2026 02:56 pm
ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించారు రాహుల్గాంధీ. అయితే రాహుల్గాంధీకి తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాదనలకు అవకాశమివ్వకుండా ఏకపక్షంగా ఆదేశాలివ్వడం ఏంటంది సుప్రీంకోర్టు. సీబీఐ, ఈడీలు... హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని ఆదేశించింది. రాహుల్గాంధీ పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.