సోషల్ మీడియాలో దూషణలు వద్దు
NEWS Aug 17,2026 02:49 pm
సోషల్మీడియాలో విభిన్నమైన అంశాలపై ఎలా వ్యవహరించాలో జనసేన అధినేత పవన్ కీలక ఆదేశాలిచ్చారు. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లొద్దు. పార్టీల సిద్ధాంతాలు, మార్గదర్శకాలకనుగుణంగానే స్పందించాలన్పారు. మాట్లాడే సమయంలో, పోస్టులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ పార్టీ శ్రేణులకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం భాషను ఉపయోగించడం మంచిది కాదన్నారు.