వర్ల రామయ్య, దళవాయి రమాదేవికి MLC
NEWS Aug 17,2026 02:28 pm
ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్సీ, బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించబోతున్నారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకి అవకాశం దక్కింది. రాయలసీమ నుంచి టీడీపీ అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించారు. త్వరలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వర్ల రామయ్య గతంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్గా వ్యవహరించారు.