మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
NEWS Aug 17,2026 02:31 pm
కరీంనగర్ నగరపాలక సంస్థ: నగరంలోని 3వ డివిజన్ విద్యారణ్యపురి, 23వ డివిజన్ బాలాజీనగర్లలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు మెరుగుపరిచి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.