మానేరుడ్యాం వద్ద ఘనంగా గంగమ్మ బోనాలు
NEWS Aug 16,2026 11:00 pm
కరీంనగర్: మానేరు డ్యాం వద్ద పట్టణ గంగపుత్ర (బెస్త) సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్పొరేటర్లు పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, నాంపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు.