రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ముద్రించాలి: బీజేపీ
NEWS Aug 16,2026 10:52 pm
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటోను తప్పనిసరిగా ముద్రించాలని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. శంకరపట్నంలో ఆయన మాట్లాడారు. ఉచిత రేషన్ బియ్యంలో 5 కిలోలు కేంద్రమే ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. మోదీ ఫోటోను పక్కనబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెస్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.