రైతాంగాన్ని సంక్షోభం నుంచి రక్షించాలి
NEWS Aug 16,2026 10:58 pm
చోడవరం : రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. 17న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంట నష్టపరిహారం, రుణమాఫీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని కోరారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.