సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
NEWS Aug 15,2026 12:41 am
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్పాయి, సీపీ శ్వేత ఐఎస్డబ్ల్యూ ఎస్పీ బాషాతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.