రేపే 'గీతన్నల చైతన్య యాత్ర'
NEWS Aug 15,2026 12:36 am
చిగురుమామిడి: సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ‘గీతన్నల చైతన్య యాత్ర’ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ నుంచి సర్వేపేట వరకు ఈ బస్సు యాత్ర సాగుతుందన్నారు. ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని, ఐదెకరాల చొప్పున తాటి వనాలు కేటాయించి, ఆధునిక పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.